తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖల్లో 563 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎఇ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ గురువారం విడుదల చేశారు. గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో అత్యధిక పోస్టులు భర్తీ చేయనున్నారు. డిప్లోమో, ఆ పై అర్హత ఉన్న అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులను టి ఎస్ పి ఎస్ సి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 29 వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అక్టోబర్ 25 న పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లో ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటిస్తారు. www.tspsc.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 54 టెక్నికల్ ఆఫీసర్స్, 258 పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ పోస్టులకు సివిల్, మెకానికల్ అభ్యర్ధులు అర్హులని ప్రకటించారు. మిగిలిన పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ వారే అర్హులని తెలిపారు.
హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఒకే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఎఇఇ పోస్టులకు నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన సర్వీస్ కమీషన్ ఎఇ లకు మాత్రం ఒకటే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష సిలబస్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఆన్ లైన్ లో , ఆఫ్ లైన్ లో రెండు విధాలుగా పరీక్ష జరగనుంది.
Apply for Details: Click Here
For Apply more Govt Jobs: Click Here
0 Comments